దేశంలో 141.70 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-27T20:55:47+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని పారదోలేందుకు కేంద ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

దేశంలో 141.70 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిని పారదోలేందుకు కేంద ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల పంపిణీ భారీయెత్తున చేపట్టింది.ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 141.70 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో రికవరీ రేట్ 98.40 శాతం గా అధికారులు పేర్కొన్నారు. గడిచిన 24గంటల్లో కొత్తగా 6,531 కేసులు నమోదయ్యాయి. గడిచిన 43 రోజుల్లో వీక్లీ పాజిటివిటీ రేట్ 1శాతం(0.63శాతం)గా అధికారులు తెలిపారు. గడిచిన 43 రోజుల్లో దేశవ్యాప్తంగా 67.29 కోట్ల టెస్టులను నిర్వహించినట్టు తెలిపారు. 

Updated Date - 2021-12-27T20:55:47+05:30 IST