దేశంలో 141.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-26T20:28:35+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 141.37కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది

దేశంలో 141.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 141.37కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 32 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 98.40శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,987 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 76,766కు చేరింది. గడిచిన 42 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం (0.62)గా వుందని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-26T20:28:35+05:30 IST