దేశంలో 140.31 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-24T20:59:31+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది.

దేశంలో 140.31 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ముమ్మరం చేసింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 140.31 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 57లక్షల డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.దేశంలో రికవరీ రేట్ 98.40 శాతం కాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 6,650 కోవిడ్ కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 77,516 కాగా గడిచిన 40 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం(0.59శాతం)గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-24T20:59:31+05:30 IST