దేశంలో 126.53 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-04T20:57:46+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ 126.53 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

దేశంలో 126.53 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ 126.53 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 73.63లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ డోస్ వేసినట్టు తెలిపారు. రికవరీ రేట్ 98.35 శాతం గా వుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,603 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 99,974 కాగా, గడిచిన 20 రోజుల్లో పాజిటివ్ రేట్ 1శాతం (0.81శాతం)గా నమోదైంది. 

Updated Date - 2021-12-04T20:57:46+05:30 IST