గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ మరింత ముమ్మరం

ABN , First Publish Date - 2021-11-04T12:47:18+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నిరోధక టీకాలు వేసే కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, 48 జిల్లా

గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ మరింత ముమ్మరం

                             - ప్రధాని మోదీ పిలుపు


చెన్నై(Chennai): గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నిరోధక టీకాలు వేసే కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, 48 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై చర్చలు జరిపారు. చెన్నై సచివాలయంలో ఈ సమావేశానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్‌, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ అల్పీ జాన్‌ వర్గీస్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... 50 శాతం కంటే తక్కువగా టీకాలు వేసిన ప్రాంతాలపై ఆరోగ్యశాఖ అధికారులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నిరోధక టీకాలు వేయడంలో సమర్థవంతంగా సేవలందిస్తున్న ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2021-11-04T12:47:18+05:30 IST