టీకాలు వేసుకోండి ప్లీజ్‌!

ABN , First Publish Date - 2021-12-15T15:41:58+05:30 IST

కరోనా మహమ్మారిని తరికొట్టేందుకు 18 ఏళ్లు పైబడిన వారంతా టీకాలు వేయించాలని కోరుతూ మన దేశానికి చెందిన ఓ సైనికుడు వినూత్న తరహాలో ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. 197 దేశాల పతాకాలతో ఆయన ప్రచారం చేపట్టారు.

టీకాలు వేసుకోండి ప్లీజ్‌!

                            - ఓ సైనికుడి ప్రచారం


ప్యారీస్‌(చెన్నై): కరోనా మహమ్మారిని తరికొట్టేందుకు 18 ఏళ్లు పైబడిన వారంతా టీకాలు వేయించాలని కోరుతూ మన దేశానికి చెందిన ఓ సైనికుడు వినూత్న తరహాలో ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. 197 దేశాల పతాకాలతో ఆయన ప్రచారం చేపట్టారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన విధంగా భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారంతా తప్పనిసరిగా రెండు డోసుల కరోనా టీకాలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మానామధురైకి చెందిన సైనికుడు ఎస్‌.బాల మురుగన్‌ (33) టీకాలపై అవగాహనా ప్రచారం చేపట్టారు. చెన్నైకి చేరుకున్న బాలమురుగన్‌ మీడియాతో మాట్లాడుతూ... కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు అలుపెరగక అంకితభావంతో సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపేలా ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా వుండగా అక్టోబరు 16వ తేదీన రామనాథపురం జిల్లా పాంబన్‌ వంతెన నుంచి తన ప్రచారానికి స్వీకారం చుట్టిన బాలమురుగన్‌.. ఇప్పుడు నగరానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ 810 కి.మీ మేర పాదయాత్ర నిర్వహించారు. తరువాత ఆంధ్రప్రదేశ్‌ మీదుగా పలు రాష్ట్రాల్లోనూ పర్యటించనున్నారు. 

Updated Date - 2021-12-15T15:41:58+05:30 IST