‘సాయ్‌’ అకాడమీలో 33 మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2022-01-22T09:12:14+05:30 IST

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) బెంగళూరులోని ఎక్స్‌లెన్స్‌ కేంద్రంలో 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

‘సాయ్‌’ అకాడమీలో 33 మందికి కొవిడ్‌

బెంగళూరు: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) బెంగళూరులోని ఎక్స్‌లెన్స్‌ కేంద్రంలో 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో పురుషుల హాకీ సీనియర్‌ జట్టులోని 16 మంది, మహిళల జట్టులోని ఇద్దరు, ఒక కోచ్‌ కొవిడ్‌ బారిన పడగా, మహిళల జూనియర్‌ హాకీ టీమ్‌లోని 15 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సాయ్‌ బెంగళూరు కేంద్రం తెలిపింది. ఇక, కిందటి వారం పటియాలలోని సాయ్‌ కేంద్రంలో 25 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి.


హర్భజన్‌కు కరోనా ::

మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తాను హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్టు ట్విటర్‌లో తెలిపాడు. ఈ నాలుగైదు రోజుల్లో తనను కలిసిన వారు కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని హర్భజన్‌ విజ్ఞప్తి చేశాడు. 

Updated Date - 2022-01-22T09:12:14+05:30 IST