కరోనా నిర్ధారణ పరీక్షలు పెంపు
ABN , First Publish Date - 2021-05-06T06:48:59+05:30 IST
జిల్లాలో సెకండ్ వేవ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంపు దల చేసినట్లు కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఒంగోలులోని ట్రిపు ల్ఐటీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని బుధవారం సందర్శించా రు.
కలెక్టర్ పోలా భాస్కర్
ఒంగోలు(కలెక్టరేట్), మే 5 : జిల్లాలో సెకండ్ వేవ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంపు దల చేసినట్లు కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఒంగోలులోని ట్రిపు ల్ఐటీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని బుధవారం సందర్శించా రు. ముందుగా అక్కడ వసతులను పరిశీలించారు. ఈ సందర్బంగా క లెక్టర్ మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు 24 గంటల్లో వ చ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాంపిల్స్ను త్వరగా జి ల్లా కేంద్రానికి తరలించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. గత ఏడాది ఆస్పత్రుల్లో 1600 పడకలతో కరోనాను ఎ దుర్కొన్నామని, ప్రస్తుతం 3వేల పడకలను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. జిల్లాలో పలు ప్రైవేటు వైద్యశాలలకు కూడా కొవిడ్ వైద్యానికి అ నుమతులు ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ టి.శ్రీనివాస్విశ్వనాథ్, మార్కెటింగ్ ఏడీ ఉపేంద్ర, ఆర్ఎంవో వేణుగోపా ల్రెడ్డి, రిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ అప్పలనాయుడు, ఆర్డీవో ప్రభాకర్రెడ్డి, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.