మంత్రులకూ ‘కొవిడ్’ నిబంధనలు: మోదీ
ABN , First Publish Date - 2020-06-03T07:25:03+05:30 IST
కొవిడ్-19 నిబంధనలు సాధారణ పౌరుల్లాగే కేంద్ర మంత్రులకూ వర్తిస్తాయని, ప్రతీఒక్కరు వాటిని తు.చ తప్పకుండా పాటించాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు...
న్యూఢిల్లీ, జూన్ 2 : కొవిడ్-19 నిబంధనలు సాధారణ పౌరుల్లాగే కేంద్ర మంత్రులకూ వర్తిస్తాయని, ప్రతీఒక్కరు వాటిని తు.చ తప్పకుండా పాటించాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద్ గౌడ, ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్లు క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాళ్లలా ప్రవర్తించకూడదని తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.