శ్రీలంకలో 43 మంది జాలర్లకు Covid

ABN , First Publish Date - 2022-02-02T18:01:07+05:30 IST

శ్రీలంక చెర నుంచి విడుదలైన 43 మంది జాలర్లకు కరోనా సోకింది. వివరాలిలా వున్నాయి... రామనాధపురం జిల్లా రామేశ్వరం, పుదుకోట జిల్లాకు చెందిన 56 మంది జాలర్లు గత డిసెంబరు 18, 20

శ్రీలంకలో 43 మంది జాలర్లకు Covid

ప్యారీస్‌(చెన్నై): శ్రీలంక చెర నుంచి విడుదలైన 43 మంది జాలర్లకు కరోనా సోకింది. వివరాలిలా వున్నాయి... రామనాధపురం జిల్లా రామేశ్వరం, పుదుకోట జిల్లాకు చెందిన 56 మంది జాలర్లు గత డిసెంబరు 18, 20 తేదీల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన విషయం తెలిసింది. వారిని శ్రీలంక కోర్టులో హాజరు పరిచిన అనంతరం నిబంధనలతో విడుదల చేశారు. వారు ఒకటీ రెండు రోజుల్లో స్వదేశానికి వస్తారని శ్రీలంకలో వున్న భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అయితే ఈ జాలర్లలో 43 మందికి కరోనా సోకినట్లు అక్కడి వైద్యాధికారులు నిర్ధారించడంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు.

Updated Date - 2022-02-02T18:01:07+05:30 IST