1,209 మందికి Covid పాజిటివ్

ABN , First Publish Date - 2022-07-15T16:04:25+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజువారీ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 1209 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 1058

1,209 మందికి Covid పాజిటివ్

బెంగళూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజువారీ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 1209 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 1058 మందికి ప్రబలగా మైసూరులో 25, ధార్వాడ 18, బళ్ళారి 14, బెళగావి 13 మందికి సోకింది. 18 జిల్లాలో పదిలో పు కేసులు నమోదు కాగా 8 జిల్లాలో ఒక కేసు నమోదు కాలేదు.  1072 మంది కోలుకోగా 24 గంటల వ్యవధిలో చిక్కబళ్ళాపురలో ఒకరు మృతి చెందారు. 6739 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులోనే 6252 మంది ఉన్నారు.

Updated Date - 2022-07-15T16:04:25+05:30 IST