16 మంది హాస్టల్ విద్యార్థినులకు Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-14T18:17:04+05:30 IST
చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి తాలూకాలోని కురుబూరు పట్టు విశ్వవిద్యాలయ హాస్టల్లో 16 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తొలుత హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులకు పాజిటివ్
- పట్టు విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన వైద్యాధికారులు
చింతామణి(బెంగళూరు): చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి తాలూకాలోని కురుబూరు పట్టు విశ్వవిద్యాలయ హాస్టల్లో 16 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తొలుత హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులకు పాజిటివ్ ప్రబలగా వీరికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్లోని విద్యార్థినులకు పరీక్షలు చేయడంతో మొత్తం 16 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాలూకా ఆరోగ్యాధికారి డాక్టర్ స్వాతి, కురుబూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పూర్ణిమా గురువారం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. హాస్టల్లో క్వారంటైన్లో ఉంటున్న విద్యార్థినులతో చర్చించారు. రోగలక్షణాలు లేకుంటే భయపడవద్దన్నారు. అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలని, తగిన వైద్య సలహాలు పొందాలన్నారు. కళాశాలలోని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేశారు.