Covid: 2వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2022-07-30T17:30:22+05:30 IST

రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత కొవిడ్‌ కేసులు(Covid Cases) 2వేలకు పైగా నమోదయ్యాయి. శుక్రవారం 2,130 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది

Covid: 2వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

బెంగళూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత కొవిడ్‌ కేసులు(Covid Cases) 2వేలకు పైగా నమోదయ్యాయి. శుక్రవారం 2,130 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1,1615, ధారవాడలో 70, మైసూరులో 51, కొడగు 47, తుమకూరులో 41, హాసన్‌ 40, బెళగావిలో 34, కలబురగిలో 33 కేసులు నమోదయ్యాయి. యాదగిరి(Yadagiri) జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కొవిడ్‌(Covid) కేసులు నమోదయ్యాయి. 1395 మంది కోలుకున్నారు. గడిచిన 24 గం టల్లో నలుగురు మృతి చెందారు. 9866 మంది చికిత్సపొందుతుండగా బెంగళూరులో 8023 మంది ఉన్నారు. 

Updated Date - 2022-07-30T17:30:22+05:30 IST