858 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-24T15:50:17+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గురువారం 858 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 820 మంది,
బెంగళూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గురువారం 858 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 820 మంది, దక్షిణ కన్నడ, మైసూరులో ఏడు చొప్పున, హాసన్, కోలార్లలో మూడు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఐదు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఎనిమిది జిల్లాల్లో ఒక్కొక్కరు నమోదు అయ్యారు. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం 682 డిశ్చార్జ్ కాగా బెంగళూరులో ఒకరు మృతి చెందారు. 5067 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 4818 మంది ఉన్నారు.