పెరుగుతున్న Covid డిశ్చార్జ్ల సంఖ్య
ABN , First Publish Date - 2022-01-25T18:50:56+05:30 IST
కొవిడ్ ప్రభావం కొనసాగుతున్నా క్రమేపీ డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య పెరగడం ఊరటనిస్తోంది. సోమవా రం రాష్ట్రవ్యాప్తంగా 46,426 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 41,703 మంది కోలుకున్నారు. వీరిలో బెంగళూరులోనే
బెంగళూరు: కొవిడ్ ప్రభావం కొనసాగుతున్నా క్రమేపీ డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య పెరగడం ఊరటనిస్తోంది. సోమవా రం రాష్ట్రవ్యాప్తంగా 46,426 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 41,703 మంది కోలుకున్నారు. వీరిలో బెంగళూరులోనే 21,569 మంది బాధితులు ఉండగా 27,008 మంది డిశ్చార్జ్ కావడం విశేషం. ఇతర జిల్లాల్లో వందల్లో కేసులు నమోదయ్యా యి. 32 మంది మృతి చెందగా బెంగళూరులో 9 మంది ఉన్నారు. ప్రస్తుతం రా ష్ట్రవ్యాప్తంగా 3,62,487 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 2,26,385 మంది బాఽధితులు ఉన్నారు.