వారంలోగా కొవిడ్‌ ఆస్పత్రిని సిద్ధం చేయండి: ఎమ్మెల్యే నవాజ్‌బాషా

ABN , First Publish Date - 2020-08-15T18:06:01+05:30 IST

మదనపల్లెలో వారంలోగా కొవిడ్‌ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని..

వారంలోగా కొవిడ్‌ ఆస్పత్రిని సిద్ధం చేయండి: ఎమ్మెల్యే నవాజ్‌బాషా

మదనపల్లె(చిత్తూరు): మదనపల్లెలో వారంలోగా కొవిడ్‌ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అధికారులను ఆదేశించారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్యశాలలో 75 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే శుక్రవారం జిల్లా వైద్యశాలకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె ప్రాంతంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన కొవిడ్‌ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్మూర్తినాయక్‌ను ఆదేశించారు.  కార్యక్రమంలో డాక్టర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-15T18:06:01+05:30 IST