Maharashtra:వణికిస్తున్న డెల్టాప్లస్ వేరియంట్..ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2021-08-14T13:47:08+05:30 IST

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రను వణికిస్తోంది. మహారాష్ట్రలోని ముంబై, బీడ్, రత్నగిరి...

Maharashtra:వణికిస్తున్న డెల్టాప్లస్ వేరియంట్..ఐదుగురి మృతి

ముంబై (మహారాష్ట్ర): కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ మహారాష్ట్రను వణికిస్తోంది. మహారాష్ట్రలోని ముంబై, బీడ్, రత్నగిరి, రాయగఢ్ ప్రాంతాల్లో 66 మందికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. ఈ వేరియంట్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన వారంతా 65 ఏళ్ల వయసు పైబడిన వారు కావడంతోపాటు వారికి ఇతర అనారోగ్యాలున్నాయని వైద్యులు చెప్పారు. కరోనా డెల్టా వేరియంట్ వల్ల రత్నగిరిలో ఇద్దరు, ముంబై, బీడ్, రాయగఢ్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. 


డెల్టా ప్లస్ వైరస్ వల్ల మరణించిన వారిలో టీకాలు వేయించుకున్నవారు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం మరో డెల్టా ప్లస్ వేరియంట్ కొత్త కేసు బయటపడింది.ముంబై,పూణేలలో డెల్టాప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి.జల్గావ్ జిల్లాలో 13 కేసులు నమోదైనాయి.రత్నగిరి జిల్లాలో 12, ముంబైలో 11 కేసులు వెలుగుచూశాయి.66 డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల్లో 32మంది పురుషులున్నారు. ఏడుగురు రోగులు 18 ఏళ్ల లోపువారు కూడా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. 


Updated Date - 2021-08-14T13:47:08+05:30 IST