ఆందోళన రేపుతున్న Covid మరణాలు

ABN , First Publish Date - 2022-01-28T16:41:18+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో ఒకే రోజు 49 మంది మృతి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే కొవిడ్‌ కేసులు గడిచిన నాలుగైదు రోజులతో పోలిస్తే కొంతమేర తగ్గాయి. భారీగా డిశ్చార్జ్‌లు పెరగడం ఆశాజనకమైంది. గురువారం

ఆందోళన రేపుతున్న Covid మరణాలు

                     - కేసుల సంఖ్య తగ్గుముఖంతో కాస్త ఊరట


బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో ఒకే రోజు 49 మంది మృతిచెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే కొవిడ్‌ కేసులు గడిచిన నాలుగైదు రోజులతో పోలిస్తే కొంతమేర తగ్గాయి. భారీగా డిశ్చార్జ్‌లు పెరగడం ఆశాజనకమైంది. గురువారం 38,083మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 17,717, మైసూరులో 2587, మండ్యలో 1802, తుమకూరులో 1584, హాసన్‌లో 1452, ధార్వాడలో 1155, బెంగళూరు గ్రామీణలో 1091, ఉడుపిలో 948ల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన 22 జిల్లాల్లోనూ వెయ్యిలోపు కేసులు నమోదయ్యా యి. 67,236మంది డిశ్చార్జ్‌ అయ్యారు. బెంగళూరులో అత్యధికంగా 43,997మంది కోలుకున్నారు. 49మంది మృతి చెందగా బెంగళూరులో 12మంది మైసూరు, బళ్ళారిలలో ఐదుగురు, దక్షిణకన్నడ, హాసన్‌లలో నలుగురు చొప్పున కాగా మిగిలిన జిల్లాల్లో ఒకరిద్దరు మృతి చెందారు. 30జిల్లాల్లో 3,28,711మంది ఆసుపత్రులలో చికిత్సలు పొందుతుండగా 1,89,853మంది బెంగళూరులో ఉన్నారు. 184 మందికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2022-01-28T16:41:18+05:30 IST