కొవిడ్ సెంటర్లో సౌకర్యాలు మెరుగుపర్చండి
ABN , First Publish Date - 2021-05-06T04:14:23+05:30 IST
స్థాని సీహెచ్సీ కొవిడ్ సెంటర్లో కరోనా రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ బుధవారం స్థానికులు ఏంపీడీవో వీరాస్వామికి వినతిపత్రం అందచేశారు.
ఉదయగిరి, మే 5 : స్థాని సీహెచ్సీ కొవిడ్ సెంటర్లో కరోనా రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ బుధవారం స్థానికులు ఏంపీడీవో వీరాస్వామికి వినతిపత్రం అందచేశారు. రోగులకు అవసరమైన మందులు, బెడ్లు, ఆక్సిజన్, సరిపడా వైద్యసిబ్బందిని నియమించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా కరోనా రోగులను చేర్చుకోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని వివరిం చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుభానీబాషా, స్థానికులు రోజ్దార్ అస్లాం, సాగర్ మన్సూర్, గయాజ్ తదితరులు పాల్గొన్నారు.