ఒక్కసారిగా పెరిగిన Covid కేసులు
ABN , First Publish Date - 2022-01-13T16:31:26+05:30 IST
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 3,200 మంది కొవిడ్తో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజే 893 కేసులు పెరిగినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రాష్ట్రంలో కరోనా
- కొత్తగా 893 మందికి పాజిటివ్
పుదుచ్చేరి: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 3,200 మంది కొవిడ్తో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజే 893 కేసులు పెరిగినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 1,883కు పెరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,27,673 మంది కరోనా నుంచి కోలుకున్నారు.