GHMC పరిధిలో 1,112 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2022-01-18T13:40:02+05:30 IST
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం కొత్తగా 1,112 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫ్రంట్లైన్ వారియర్స్గా పేరుగాంచిన
హైదరాబాద్ సిటీ: జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం కొత్తగా 1,112 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫ్రంట్లైన్ వారియర్స్గా పేరుగాంచిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. చాలా మందికి వైరస్ లక్షణాలు కనిపించకపోవడంతో పరీక్షలు చేయించుకోకుండా సాధారణంగా సంచరిస్తున్నారు. దీంతో ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతోంది. కార్యాలయాల్లో పనిచేసే వారిలో ఒకరికి కరోనా వస్తే సులభంగా ఇతరులకు సోకుతోంది.
(ఆంధ్రజ్యోతి జోన్ బృందం):
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో సోమవారం 219 మందికి కరోనా పాజిటీవ్గా నిర్ధారణ అయింది. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 175 మందికి, రాజేంద్రనగర్ సర్కిల్లో 130 మందికి, అడ్డగుట్టలో 20మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో రెండేళ్ల బాబుకు సైతం పాజిటివ్ నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని నాలుగు యూపీహెచ్సీలు, దుండిగల్ పీహెచ్సీతోపాటు శివాలయనగర్ బస్తీ దవాఖానలో సోమవారం 166 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. కూకట్పల్లిలో 205, శేరిలింగంపల్లి మండల పరిధిలో 137కేసులు నమోదయ్యాయి.