338 మందికి కరోనా

ABN , First Publish Date - 2022-01-22T06:25:09+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.

338 మందికి కరోనా

విజయవాడ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మూడు రోజులుగా నిత్యం 300కు పైగా కేసులు అధికారికంగా నమోదవుతుండగా, లక్షణాలతో బాధపడుతూ సొంత వైద్యం చేసుకుంటున్నవారు లెక్కకు మించి ఉన్నట్టు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 338 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. వీటితో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,24,126కు చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 1,482 వద్ద నిలకడగానే ఉంది. జిల్లాలో వైరస్‌ బారిన పడినవారిలో ఇప్పటి వరకు 1,19,451 మంది కోలుకున్నారు. ఇంకా 3,193 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2022-01-22T06:25:09+05:30 IST