39 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-01-27T06:44:35+05:30 IST
జిల్లాలో మంగళవారం కొత్తగా 39 మందికి కరోనా వైరస్ సోకింది.
42 మంది డిశ్చార్జి
ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో మంగళవారం కొత్తగా 39 మందికి కరోనా వైరస్ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,540కి చేరింది. మరణాల సంఖ్య 676 దగ్గర నిలకడగా ఉంది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 42 మంది గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 245 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.