20 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-01-25T06:45:23+05:30 IST
జిల్లాలో ఆదివారం కొత్తగా 20 మందికి కరోనా వైరస్ సోకింది.
42 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
జిల్లాలో ఆదివారం కొత్తగా 20 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,490కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 676 దగ్గర నిలకడగా ఉంది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో 42 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 252 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.