19 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-21T07:11:07+05:30 IST

జిల్లాలో బుధవారం కొత్తగా 19 మందికి కరోనా వైరస్‌ సోకింది.

19 మందికి కరోనా

26 మంది డిశ్చార్జి     

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)  : జిల్లాలో బుధవారం కొత్తగా 19 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,395 కి చేరింది. జిల్లాలో అధికారికంగా కరోనా మరణాల సంఖ్య 676 దగ్గర నిలకడగానే ఉంది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 26 మంది గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 259 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-01-21T07:11:07+05:30 IST