కృష్ణాలో కొత్తగా ఆరుగురికి కరోనా

ABN , First Publish Date - 2021-01-19T06:37:18+05:30 IST

జిల్లాలో సోమవారం కొత్తగా ఆరుగురికి కరోనా వైరస్‌ సోకింది.

కృష్ణాలో కొత్తగా ఆరుగురికి కరోనా

35 మంది డిశ్చార్జి                                                 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

జిల్లాలో సోమవారం కొత్తగా ఆరుగురికి కరోనా వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,341కి చేరింది. మరణాల సంఖ్య 676 దగ్గర నిలకడగా ఉంది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 35 మంది గడిచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 271 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-01-19T06:37:18+05:30 IST