జిల్లాలో కొత్తగా 49 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-01-13T06:38:50+05:30 IST
జిల్లాలో మంగళవారం కొత్తగా 49 మందికి కరోనా వైరస్ సోకింది.
మరో బాధితుడు మృతి
(విజయవాడ , ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం కొత్తగా 49 మందికి కరోనా వైరస్ సోకింది. కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాధితుడు మరణించారు. ఈ కొత్త కేసులతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,240కు చేరుకుంది. కరోనా మరణాలు అధికారికంగా 673కు పెరిగాయి. ఇంకా 336 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.