జిల్లాలో కొత్తగా 49 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-13T06:38:50+05:30 IST

జిల్లాలో మంగళవారం కొత్తగా 49 మందికి కరోనా వైరస్‌ సోకింది.

జిల్లాలో కొత్తగా 49 మందికి కరోనా

మరో బాధితుడు మృతి 

(విజయవాడ , ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మంగళవారం కొత్తగా 49 మందికి కరోనా వైరస్‌ సోకింది. కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాధితుడు మరణించారు. ఈ కొత్త కేసులతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,240కు చేరుకుంది. కరోనా మరణాలు అధికారికంగా 673కు పెరిగాయి. ఇంకా 336 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-01-13T06:38:50+05:30 IST