మరో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-07-24T06:57:26+05:30 IST

జిల్లాలో కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పాజిటివ్‌ బాధితులు శుక్రవారం మరణించారు.

మరో ఇద్దరు మృతి

127 మందికి వైరస్‌ 

విజయవాడ, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పాజిటివ్‌ బాధితులు శుక్రవారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 127 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,06,822కు చేరుకున్నాయి. మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,178కి పెరిగాయి. వైరస్‌ బారిన పడివారిలో ఇప్పటి వరకు 1,02,819 మంది కోలుకున్నారు. ఇంకా 2,825 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-07-24T06:57:26+05:30 IST