భారీగా పెరుగుతున్న Covid కేసులు
ABN , First Publish Date - 2022-01-09T17:28:15+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరు కేంద్రంగా తీవ్రమనిపిస్తున్నా మరో ఆరు జిల్లాల్లో వందలలో నమోదవుతుండడం సర్వత్రా భయాందోళనకు కారణమవుతోంది. శనివారం 8,906 మందికి పాజిటివ్ నిర్ధారణ
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరు కేంద్రంగా తీవ్రమనిపిస్తున్నా మరో ఆరు జిల్లాల్లో వందలలో నమోదవుతుండడం సర్వత్రా భయాందోళనకు కారణమవుతోంది. శనివారం 8,906 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 7,113 మంది సోకింది. హావేరి, యాదగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 508మంది కోలుకోగా నలుగురు మృతిచెందారు. వీరిలో బెంగళూరుకు చెందిన వారు ముగ్గురు కాగా, కలబుర్గికి చెందినవారు ఒకరు ఉన్నారు. ప్రస్తుతం 38,507 మంది చికిత్సలు పొందుతున్నారు. పదిరోజులక్రితం 7వేల యాక్టివ్ కేసులు కాగా 31వేల మంది పెరిగారు.