9 జిల్లాల్లో నిల్.. 7 జిల్లాల్లో ఒక్కొక్కరు..
ABN , First Publish Date - 2022-03-09T16:50:29+05:30 IST
రాష్ట్రంలో బెంగళూరు మినహా ఇతర జిల్లాల్లో కొవిడ్ ప్రభావం తగ్గింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 197 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఏడు జిల్లాల్లో ఒక్కొక్క బాధితుడు
బెంగళూరు: రాష్ట్రంలో బెంగళూరు మినహా ఇతర జిల్లాల్లో కొవిడ్ ప్రభావం తగ్గింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 197 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఏడు జిల్లాల్లో ఒక్కొక్క బాధితుడు నమోదయ్యాడు. బెంగళూరులో 130 మందికి పాజిటివ్ ప్రబలగా 13 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 258 మంది కోలుకోగా 8 మంది మృతి చెందారు. రాయచూరులో ఇద్దరు, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 2,980 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా బెంగళూరులో 2,308 మంది ఉన్నారు.