బెంగళూరు, మైసూరులో పెరిగిన Covid కేసులు

ABN , First Publish Date - 2021-12-04T17:49:23+05:30 IST

బెంగళూరు, మైసూరులో కొవిడ్‌ కేసులు పెరిగాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 413 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 212, మైసూరులో 45మందికి, శివమొగ్గలో 33మందికి, తుమకూరులో 30మందికి

బెంగళూరు, మైసూరులో పెరిగిన Covid కేసులు

బెంగళూరు: బెంగళూరు, మైసూరులో కొవిడ్‌ కేసులు పెరిగాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 413 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 212, మైసూరులో 45మందికి, శివమొగ్గలో 33మందికి, తుమకూరులో 30మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 10 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 256 మంది కోలుకోగా నలుగురు మృతిచెందారు. 6,896మంది చికిత్స పొందుతున్నారు. శివమొగ్గలోని నర్సింగ్‌ కళాశాలలో మరో ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గాడికొప్పలోని నంజప్ప లైఫ్‌కేర్‌ నర్సింగ్‌ కళాశాలకు కేరళ నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌ ప్రబలింది.

Updated Date - 2021-12-04T17:49:23+05:30 IST