Covid ప్రభావం రాజధానిలో అత్యధికం
ABN , First Publish Date - 2021-11-24T17:40:33+05:30 IST
కొవిడ్ ప్రభావం రాజధానిలోనే అత్యధికంగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 224 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అత్యధికంగా
బెంగళూరు: కొవిడ్ ప్రభావం రాజధానిలోనే అత్యధికంగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 224 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అత్యధికంగా బెంగళూరులో 122 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, మైసూరులో 22, దక్షిణకన్నడలో 17మంది బాధితులు నమోదయ్యారు. ఇతర జిల్లాల్లో పదిమందిలోపు ఉన్నారు. 379 మంది కోలుకున్నారు. ఐదుగురు మృతిచెందారు. బెంగళూరు, బెళగావి, దక్షిణకన్నడ, కొప్పళ, తుమకూరులలో తలా ఒకరు మృతిచెందారు. ప్రస్తుతం 6,707మంది చికిత్సలు పొందుతున్నారు.