రాష్ట్రంలో పెరిగిన Covid కేసులు
ABN , First Publish Date - 2022-06-17T16:30:39+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం 833 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 791 మందికి. మైసురులో12, ఉడిపిలో ఐదుగురు,
బెంగళూరు, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం 833 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 791 మందికి. మైసురులో12, ఉడిపిలో ఐదుగురు, దక్షిణకన్నడలో 6, బళ్లారి, బెంగళూరు గ్రామీణ, కోలారులలో నలుగురికి చొప్పున పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ధార్వాడలో ముగ్గురికి, మిగిలిన జిల్లాల్లో ఒకటి, రెండు కేసులు నమోదు అయ్యాయి.458 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో బెళగావిలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 4371 మంది చికిత్ప పొందుతున్నారు.