బెంగళూరు మినహా తగ్గిన Covid కేసులు
ABN , First Publish Date - 2022-02-26T17:47:09+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరు మినహా 29 జిల్లాలోనూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం గా 628 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా రెండు జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. మరో 14 జిల్లాలో
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరు మినహా 29 జిల్లాలోనూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తం గా 628 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా రెండు జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. మరో 14 జిల్లాలో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 13 జిల్లాల్లో 30లోపు బాధితులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1349 మంది కోలుకున్నారు. 15మంది మృతిచెందారు. 30 జిల్లాల్లో 7518 మంది చికిత్సలు పొందుతున్నారు. బెంగళూరులో 3,97 3 మంది అత్యధికం కాగా బీదర్, గదగ్ జిల్లాల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు.