కొవిడ్ కొత్త కేసులు 54
ABN , First Publish Date - 2020-11-29T06:46:34+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), నవంబరు 28: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ట్రూనాట్ పరీక్షల ద్వారా 10 మందికి, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల ద్వారా 44 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,22,206కి చేరింది. తాజాగా మరణాలు లేకపోవడంతో మరణాల సంఖ్య 636గా ఉంది. 3,945 మంది యాక్టివ్ దశలో ఉండగా, 1,17,625 మంది కోలుకున్నారు.