200 దాటిన Covid కేసులు
ABN , First Publish Date - 2022-05-26T18:06:39+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నాలుగు నెలల తర్వాత 200 మార్కును దాటాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 208 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులో 197
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు నాలుగు నెలల తర్వాత 200 మార్కును దాటాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 208 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులో 197 మంది, దక్షిణకన్నడ 6, మైసూరులో ముగ్గురికి, చిక్కమగళూరు, తుమకూరులో ఒక్కొక్కరికి వైరస్ నిర్ధారణ అయింది. 124 మంది డిశ్చార్జ్ కాగా 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1799 మంది చికిత్సలు పొందుతున్నారు.