జిల్లాలో 9 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-03-04T06:39:31+05:30 IST
జిల్లాలో బుధవారం కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గుంటూరు(మెడికల్), మార్చి 3: జిల్లాలో బుధవారం కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో 3 కేసులు, నరసరావుపేటలో 2 కేసులు, అచ్చంపేట, పెదకాకాని, సత్తెనపల్లి, దుర్గిలో ఒక్కొక్క కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయి.
2083 మందికి వ్యాక్సినేషన్
కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బుధవారం 45 కేంద్రాల్లో 2083 మంది తొలి విడత వ్యాక్సిన్ పొందారు. వీరిలో ఆరోగ్య సిబ్బంది 1410 మంది, 60 ఏళ్లుపైబడిన వృద్ధులు, 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు 673 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా తొలి విడత వ్యాక్సినేషన్ పొందిన వారి సంఖ్య 54,766కు చేరింది. రెండో డోస్ వ్యాక్సిన్ 560 మంది పొందారు.