115 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-05T06:32:04+05:30 IST
జిల్లాలో శుక్రవారం కొత్తగా 115 మందికి వైరస్ సోకింది.
మరో ఇద్దరు బాధితులు మృతి
124 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో శుక్రవారం కొత్తగా 115 మందికి వైరస్ సోకింది. మరో ఇద్దరు బాధితులు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 45,895కి చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 643కుపెరిగాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితుల్లో 124 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 1,209 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.