కొత్తగా 85 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-30T06:44:58+05:30 IST

కొత్తగా 85 మందికి కరోనా

కొత్తగా 85 మందికి కరోనా

మరో ఇద్దరు బాధితులు మృతి 

ఆసుపత్రుల నుంచి 226 మంది డిశ్చార్జి 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

జిల్లాలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా 85 మందికి వైరస్‌ సోకింది. మరో ఇద్దరు పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 45,342కు చేరుకున్నాయి. కరోనా మరణాలు అధికారికంగా 636కుపెరిగాయి. గడచిన 24 గంటల్లో 226 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 1,387 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.    

Updated Date - 2020-11-30T06:44:58+05:30 IST