102 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-28T06:42:58+05:30 IST

జిల్లాలో కరోనా ప్రభావం తగ్గడం లేదు.

102 మందికి కరోనా

మరో ఇద్దరు బాధితులు మృతి 

ఆసుపత్రుల నుంచి 123 మంది డిశ్చార్జి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)  

జిల్లాలో కరోనా ప్రభావం తగ్గడం లేదు. శుక్రవారం కొత్తగా 102 మందికి వైరస్‌ సోకింది. మరో ఇద్దరు బాధితులు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 45,154కు చేరుకున్నాయి. మరణాలు అధికారికంగా 632కు పెరిగాయి. గడచిన 24 గంటల్లో మరో 123 మంది పాజిటివ్‌ బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా.. ఇంకా 1,671 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.      

Updated Date - 2020-11-28T06:42:58+05:30 IST