152 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-07-28T05:43:43+05:30 IST
జిల్లాలో కొత్తగా 152 మందికి కరోనా వైరస్ సోకింది. మంగళవారం ఉదయం వరకు 7,532 శాంపిల్స్ ఫలితాలు రాగా అందులో 2.02 శాతం మందికి పాజిటివ్ వచ్చింది.
పాజిటివ్ రేట్ 2.02 శాతం
గుంటూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 152 మందికి కరోనా వైరస్ సోకింది. మంగళవారం ఉదయం వరకు 7,532 శాంపిల్స్ ఫలితాలు రాగా అందులో 2.02 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. మిగతా 97.98 శాతం మందికి వైరస్ సోకలేదని నిర్ధారణ జరిగింది. హోం ఐసోలేషన్లో ఉన్న వారిలో 110 మంది కోలుకోవడంతో క్రియాశీలక కేసులు 1,463కి తగ్గాయి. కొవిడ్తో ఆరోగ్యం విషమించి గుంటూరు నగరం, దాచేపల్లిలో ఒక్కొక్కరు చనిపోయారు. తాజాగా గుంటూరులో 40, నరసరావుపేటలో 11, తెనాలిలో 11, బాపట్లలో 6, గురజాలలో 5, దాచేపల్లిలో 5, చిలకలూరిపేటలో 4, అచ్చంపేటలో 4, బెల్లంకొండలో 4, రేపల్లెలో 4, వట్టిచెరుకూరులో 3, కర్లపాలెంలో 3, రొంపిచర్లలో 3, నూజెండ్లలో 3, రెంటచింతలలో 3, పొన్నూరులో 3, చేబ్రోలులో 3, గుంటూరు రూరల్లో 2, మంగళగిరిలో 2, మేడికొండూరులో 2, క్రోసూరులో 1, పెదకూరపాడులో 2, ఫిరంగిపురంలో 2, ప్రత్తిపాడులో 1, రాజుపాలెంలో 2, సత్తెనపల్లిలో 1, తాడేపల్లిలో 2, తాడికొండలో 2, దుర్గిలో 2, మాచర్లలో 1, పిడుగురాళ్లలో 1, బొల్లాపల్లిలో 1, నాదెండ్లలో 1, వినుకొండలో 1, అమర్తలూరులో 1, చెరుకుపల్లిలో 1, కొల్లూరులో 2, నగరంలో 2, నిజాంపట్నంలో 1, చుండూరులో 1, వేమూరులో 1 పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు.
12 వేల మందికి పైగా వ్యాక్సినేషన్
వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోన్నది. మంగళవారం 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 5,261, ప్రవాస భారతీయులు 37, చిన్నపిల్లలున్న తల్లులు 2,239, గర్భిణులు 672, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకరు, ప్రైవేటు టీచర్లు 89 మంది కలిపి మొత్తం 8,299 మంది తొలి డోసు టీకాని చేయించుకున్నారు. మరో 3,990 మంది రెండో డోసు టీకా చేయించుకున్నట్లు డీఎంహెచ్వో తెలిపారు.