గుజరాత్లో కరోనా బారినుంచి కోలుకున్న 50 వేల మంది
ABN , First Publish Date - 2020-08-07T02:25:02+05:30 IST
గుజరాత్లో కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 50 వేలు దాటింది. ఇవాళ మరో ..
అహ్మదాబాద్: గుజరాత్లో కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 50 వేలు దాటింది. ఇవాళ మరో 917 మంది కొవిడ్-19 పేషెంట్లు డిశ్చార్జ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 50,322కి చేరినట్టు తెలిపారు. మరోవైపు కొత్తగా 1,034 మంది ఇన్ఫెక్షన్కు గురైనట్టు గుర్తించారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,811కు చేరినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 27 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 2,584కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసులు 14,905 వరకు ఉన్నట్టు అధికారులు తెలిపారు.