కరోనాపై అపోహలు వద్దు...వివక్షను అరికడదాం: డాక్టర్ అర్జా శ్రీకాంత్

ABN , First Publish Date - 2020-07-05T12:35:02+05:30 IST

కరోనాపై అపోహలు వద్దు...వివక్షను అరికడదాం: డాక్టర్ అర్జా శ్రీకాంత్

కరోనాపై అపోహలు వద్దు...వివక్షను అరికడదాం: డాక్టర్ అర్జా శ్రీకాంత్

అమరావతి: కోవిడ్-19పై అపోహలను ఛేదిద్దామని...వివక్షను అరికడదామని...కోవిడ్-19కు వ్యతిరేకంగా ఏకమవుదామని ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19 డాక్టర్ అర్జా శ్రీకాంత్ పిలుపునిచ్చారరు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తూనే ఉందని...ఇటువంటి తరుణంలో వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు నిత్యం వారి ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం ముందుండి పోరాడుతున్నారని తెలిపారు. 


మనం క్షేమంగా ఉండాలని వాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నారన్నారు. ఈ క్రమంలో ఫ్రంట్ లైన్ -వారియర్స్‌లో చాలా మంది కోవిడ్-19 బారినపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలను ప్రశంసించాలి తప్ప ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్న వారి పట్ల, వారి కుటుంబాల పట్ల వివక్ష చూపకూడదని హితవు పలికారు. అదే విధంగా వారి గురించి గానీ, కోవిడ్-19 గురించి గానీ తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని అన్నారు.


ఈ సంక్షోభ సమయంలో పుకార్లు, తప్పుడు సమాచారం వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల్లో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయన్నారు. ఇటువంటి పరిణామాలు కోవిడ్-19 బాధితుల రికవరీపైనా ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విపులంగా క్రోడీకరించి క్రింద జత చేస్తున్నామని చెప్పారు. అందరం పాటించి కోవిడ్-19కు వ్యతిరేకంగా ఏకమవుదామని పిలుపునిచ్చారు. ఇవి నాకు వర్తించదు అని ఎవరు అనుకున్నా వారు తమను, ఇతరులను కూడా ప్రమాదంలోనికి నెడుతున్నారనే విషయాన్ని గమనించాలని డాక్టర్ శ్రీకాంత్ హెచ్చరించారు. 

Updated Date - 2020-07-05T12:35:02+05:30 IST