కొవిడ్ పాజిటివ్ 15
ABN , First Publish Date - 2020-11-30T06:10:36+05:30 IST
జిల్లాలో ఆదివారం 3,528 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15 మందికి వైరస్ సోకినట్లు తేలింది
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 29: జిల్లాలో ఆదివారం 3,528 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15 మందికి వైరస్ సోకినట్లు తేలింది. జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 60,223కు చేరింది. ఇందులో 192 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 59,545 మంది కోలుకున్నారు. కర్నూలు నగరంలోని రాంభొట్ల దేవాలయం పుష్కర ఘాట్లో ఓ భక్తునికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకూ జిల్లాలోని 23 పుష్కర ఘాట్లలో 3,214 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 18 మందికి పాజిటివ్ వచ్చింది.