వైసీపీలో కోవర్టులపై చర్యలు తీసుకోండి: రోజా

ABN , First Publish Date - 2022-01-01T01:40:02+05:30 IST

నగరి నియోజకవర్గంలో అధికారులను భయపెట్టి, మంత్రికి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు.

వైసీపీలో కోవర్టులపై చర్యలు తీసుకోండి: రోజా

చిత్తూరు: ‘‘గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసి సస్పెండయ్యారు. పార్టీలోనే ఉంటూ వైసీపీలో కోవర్టులుగా పని చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో అధికారులను భయపెట్టి, మంత్రికి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోండి’ అని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ మేరకు వైసీపీ నాయకులతో కలిసి శుక్రవారం ఆమె చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలో మీడియా మాట్లాడారు. తాను, తన కుటుంబ సభ్యులు అక్రమంగా ఇసుక అమ్ముకుంటున్నామని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తానేమైనా తప్పులు చేసుంటే నేరుగా సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. నగరి నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై ఇది వరకే మంత్రి పెద్దిరామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశామని, మరోసారి మంత్రిని కలిసి వివరిస్తామని రోజా తెలిపారు.

Updated Date - 2022-01-01T01:40:02+05:30 IST