కాసేపట్లో కోర్టుకు పట్టాభి తరలింపు
ABN , First Publish Date - 2021-10-21T20:44:00+05:30 IST
విజయవాడకు ప్రభుత్వాసుపత్రికి టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో పట్టాభికి వైద్యపరీక్షలు చేస్తున్నారు.
విజయవాడ: విజయవాడకు ప్రభుత్వాసుపత్రికి టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో పట్టాభికి వైద్యపరీక్షలు చేస్తున్నారు. కాసేపట్లో కోర్టుకు తరలించనున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని బుధవారం రాత్రి హైడ్రామా మధ్య పోలీసులు అరెస్టు చేశారు. సీఎం జగన్పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పీఎస్లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని పోలీసు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టాభిపై ఎవరు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు.