కోర్టుల్లో సదుపాయాల కల్పనకు ప్రత్యేక సంస్థ
ABN , First Publish Date - 2021-12-04T06:43:31+05:30 IST
దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ...
న్యూఢిల్లీ, డిసెంబరు 3: దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నుంచి ప్రతిపాదన వచ్చినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్జేఐఏఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేయాలని జస్టిస్ రమణ ప్రతిపాదించినట్టు మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని పాలక బృందం ఈ సంస్థ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.