CONGRESS మాజీ మంత్రి శంకర్రావుకు జరిమానా

ABN , First Publish Date - 2022-01-13T01:28:50+05:30 IST

మాజీ మంత్రి శంకర్రావుకు ప్రజాప్రతినిధులు కోర్టు జరిమానా విధించింది. శంకర్రావు దాడి చేశారని..

CONGRESS మాజీ మంత్రి శంకర్రావుకు జరిమానా

హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్రావుకు ప్రజాప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది. శంకర్రావు దాడి చేశారని కుటుంబ సభ్యులు 2015‌లో  షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయింది. తాజాగా ఈ కేసులో కోర్టు తుది తీర్పు వెలువరించింది. 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత శంకర్రావును దోషిగా తేల్చింది. శంకర్రావు‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది. విచారణ సమయంలో శంకర్రావు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతని ఆరోగ్య పరిస్థితిని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఆయనకు విధించిన 6 నెలల జైలు శిక్షని రద్దు చేస్తూ కేవలం జరిమానా మాత్రమే విధిస్తూ ఆదేశించింది. 

Updated Date - 2022-01-13T01:28:50+05:30 IST