కొరియర్‌ పార్శిల్‌లో రూ.1.20 కోట్ల విలువైన బంగారం

ABN , First Publish Date - 2021-05-12T17:48:48+05:30 IST

దుబాయ్‌ నుంచి సోమవారం రాత్రి చెన్నైకు వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్‌లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని

కొరియర్‌ పార్శిల్‌లో రూ.1.20 కోట్ల విలువైన బంగారం

చెన్నై/పెరంబూర్‌: దుబాయ్‌ నుంచి సోమవారం రాత్రి చెన్నైకు వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్‌లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఆ పార్శిల్స్‌లో చెన్నై చిరునామాగా పూలు, కూరగాయల విత్తనాలు అని రాసి ఉంచిన డబ్బాలు అధిక బరువుతో వుండడంతో అనుమానించిన అధికారులు డబ్బాలు పరిశీలించగా వాటిలో బదులుగా బంగారం పొడి ఉన్నట్టు గుర్తించారు. మొత్తం నాలుగు డబ్బాల్లో 2.5 కిలోల బంగారు పొడిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఈ బంగారం విలువ రూ.1.20 కోట్లు వుంటుందని పేర్కొన్న అధికారులు, ఈ పార్శిల్స్‌ ఎక్కడ నుంచి వచ్చాయనే విషయమై విచారణ చేపట్టారు.

Updated Date - 2021-05-12T17:48:48+05:30 IST