ముగ్గురు దొంగలతో ఒంటరిగా పోరాడిన యువతి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-04T08:12:40+05:30 IST

అర్ధరాత్రి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ముగ్గురు దొంగలను ఒక యువతి బెంబేలెత్తించింది. వారి చేతిలో ఉన్న కత్తిని చూసి కూడా వెరవకుండా ముగ్గురు దొంగలతో ఒంటరిగా పోరాడింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో..

ముగ్గురు దొంగలతో ఒంటరిగా పోరాడిన యువతి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

అర్ధరాత్రి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన ముగ్గురు దొంగలను ఒక యువతి బెంబేలెత్తించింది. వారి చేతిలో ఉన్న కత్తిని చూసి కూడా వెరవకుండా ముగ్గురు దొంగలతో ఒంటరిగా పోరాడింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది. 


రియా అనే యువతి తన కాలేజిలో పరీక్షలు ఉండటంతో రాత్రి పూట ఇంట్లో చదువుకుంటోంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఆమె చదువుకుంటుండగా.. ముగ్గురు దొంగలు ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారు. ఇంటి బయట గడియను పూర్తిగా పీకేసి లోపలకు వచ్చారు. ఆ చప్పుడు విని పైకి లేచిన రియా.. దొంగలను చూసి భయపడకుండా ఎదిరించింది. వారిలో ఒకడు తన చేతిలోని కత్తితో రియా భుజంపై పొడిచాడు. ఆ నొప్పిని భరిస్తూ ఆమె గొడవ పడింది. ఆ శబ్దాలకు మిగతా కుటుంబ సభ్యులు కూడా లేచి కేకలు పెట్టారు. దీంతో ఓ దుండగుడు రియా చెల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో భుజంపై కత్తిగాటును లెక్కచేయకుండా దూసుకెళ్లి అతన్ని బలంగా పక్కకు నెట్టేసింది రియా. దాంతో ఆమెను ఎదిరించడం అసాధ్యం అని తెలుసుకున్న ముగ్గురు దొంగలు భయంతో పారిపోయారు. 


రియాను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా.. భుజంపై 24 కుట్లు పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-04T08:12:40+05:30 IST